వైరల్ అవుతున్న శ్రీ వల్లి ఫోటో పై క్లారిటీ ఇచ్చిన పుష్ప టీం...!!

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్  కాంబినేషన్ లో పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప2 తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి.
పుష్ప2 నుంచి కొన్నిరోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందటా.. ఫస్ట్ పార్ట్ తో పోల్చి చూస్తే సెకండ్ పార్ట్ లో శ్రీవల్లి పాత్రకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే పుష్ప2 మూవీలో శ్రీవల్లి చనిపోయిందంటూ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
ఈ ఫోటోను చూసిన నెటిజన్లు పుష్ప2 మూవీలో శ్రీవల్లి చనిపోవడమే ట్విస్ట్ అని ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే విచిత్రం ఏంటంటే వైరల్ అయిన ఫోటోలో ఉన్న హీరోయిన్ అసలు రష్మిక కాదటా.. ఆ ఫోటో అసలు పుష్ప2 సినిమాకు సంబంధించిన ఫోటో కూడా కాదు. గతంలోనే ఈ ఫోటోకు సంబంధించి మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చినా మళ్లీ ఈ ఫోటో బాగా వైరల్ అవుతోంది. ఒక సినిమాలోని షాట్ లో హీరోయిన్ అచ్చం శ్రీవల్లి పాత్రను పోలి ఉండటంతో ఈ వార్త వైరల్ అయిందటా.ఈ ఫోటో మరాఠీ మూవీకి సంబంధించిన ఫోటో కావడం విశేషం..
మరోవైపు పుష్ప2 మూవీ మామూలుగా ఉండదని కామెంట్లు మీద కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని అంచనాలు పెట్టుకుని చూసినా సినిమా నిరాశపరచదని కేజీఎఫ్2 సినిమాను మించేలా ఈ సినిమాను ప్లాన్ చేశారని కూడా తెలుస్తోంది. పుష్ప2 మూవీలో ఇతర పాత్రలకు కూడా ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుందని సమాచారం. పుష్ప2 మూవీ ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందటా.
మైత్రీ నిర్మాతలకు ఈ సినిమా విడుదల కు ముందు రిలీజ్ తర్వాత ఎన్నో లాభాలను కూడా అందిస్తోంది. మైత్రీ నిర్మాతలు నిర్మించిన భారీ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడం విశేషం.. పుష్ప2 సినిమా విడుదల తేదిని  మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: