అర్ధరాత్రి అలాంటి పనులు చేస్తున్న సోనాక్షి సిన్హా....!!

murali krishna
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా గురించి మనందరి కీ తెలిసిందే. శత్రజ్ఞ సిన్హా వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఒకవైపు సినిమా లలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ సత్తాను చాటుతోంది.
సినిమాలతో పోల్చుకుంటే వెబ్ సిరీస్ ల ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంటుంది సోనాక్షి సిన్హా. కంటెంట్ ఓరియేంటెడ్ సిరీస్ ల్లో నటిస్తూ మంచి పేరు దక్కించుకుంటోంది. ఆ మధ్య రిలీజ్ అయిన దహడ్ లో సిన్సియర్ పోలీస్ అధికారిణి పాత్ర లో మెప్పించిన సంగతి తెలిసిందే.
అయితే ఈసినిమా కారణం గా సోనాక్షి తల్లిదండ్రుల్ని బాగా ఇబ్బంది పెట్టిన సంఘటనని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాక్షన్ సినిమాలు అంతే చాలా ఇష్టం. వాటి ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. దహాడ్ సినిమా ద్వారా బైక్ నడిపే అవకాశం వచ్చింది. అంతకంటే ముందే ఒక బైక్ కొన్నాను అది చూసి మా అమ్మ నాన్నలు బాగా కంగారు పడ్డారు. నడిపేటప్పుడు కిందపడి దెబ్బలు తగిలించు కుంటానని బాధపడేవారు. కానీ వాళ్లకి తెలియని విషయం ఏంటంటే? అదే బైక్ నేను రాత్రుళ్లు షికార్లు చేసి వచ్చేదాన్ని.ముంబై వీధుల్లో మాస్క్ ధరించి అలవోక గా తిరిగేదాన్ని. దర్శకురాలు రినూ కగ్టి అయితే స్టంట్ మాస్టర్ కన్నా నేను బాగా బైక్ నడుపుతున్నాను అనేవారు. నాలో ఆ నమ్మకమే నాకు నేనుగా సొంతంగా బైక్ నడిపే సన్నివేశాల కు అవకాశం కల్పించింది. లేదంటే వాటికోసం ప్రత్యేకం గా డూప్ పెట్టాల్సి వచ్చేది. నిర్మాతల కు అదనపు భారంగా ఉండేది. తర్వాత నా గురించి ఈ విషయాల న్నీ అమ్మనాన్నల కు తెలిసి షాక్ అయ్యారు. ఇదంతా నువ్వే చేసావా? అని ఆశ్చర్యాని కి గురయ్యారు అని చెప్పుకొచ్చింది సోనాక్షి సిన్హా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: