ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సినీ స్టార్స్..!!
ఈ సభకు కొంతమంది అగ్ర హీరోలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్లు సమాచారం శతజయంతి కమిటీ కన్వీనర్ టిడి జనార్ధన్ గారు ఈ విషయాన్ని తెలిపారు.. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేష్, కళ్యాణ్ రామ్ కనడ సినీ ఇండస్ట్రీ నుంచి హీరో శివరాజ్ కుమార్.. మురళీమోహన్, జయప్రద, రాఘవేంద్రరావు,, అశ్వని దత్, సుమన్ తదితరులు ఈ సభలో పాల్గొనడం జరుగుతోంది.
అలాగే సిపిఎం సిపిఐ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, డి రాజా హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ కొంతమంది బిజెపి ప్రధాన కార్యదర్శిని నాయకులతోపాటు పురేందేశ్వరి కూడా హాజరు కాబోతోంది. ఎన్టీఆర్ జీవిత విశేషాలతో శక పురుషుడు అనే పేరుతో ఒక ప్రత్యేక సంచికను కూడా ఈ సభలో ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. తొలి సభను శతజయంతి కమిటీ విజయవాడలో నిర్వహించగా రెండవ సభను హైదరాబాదులో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎవరెవరు ఈ వేడుకలకు హాజరు కాబోతున్నారు అనే విషయం తెలియాల్సి ఉన్నది. ఇక ఈ రోజున JR .ఎన్టీఆర్ పుట్టినరోజు కావడం కూడా గమనార్హం. ప్రస్తుతం ఎన్టీఆర్కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.