రామ్ చరణ్ 'ఎవడు' మూవీలో.. ఈ బిగ్ మిస్టేక్ గమనించారా?

praveen
సాధారణంగా సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాను ఫీల్ అవుతూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఇక కొన్ని సన్నివేశాలలో ఉండే మిస్టేక్స్ ని పెద్దగా పట్టించుకోరు. ఇలా సినిమాల్లో ఉండే కొన్ని మిస్టేక్స్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చర్చకు వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ హిట్ మూవీకి సంబంధించి ఇలాంటి చర్చే జరుగుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపు దిద్దుకున్న సినిమా ఎవడు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.

 ఈ సినిమాలో శృతిహాసన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. అంతేకాదు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. 2014 జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 45 కోట్లకు పైచిలుకు కలెక్షన్ సాధించి మంచి విజయాన్ని అందుకుంది. అయితే రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఒక బిగ్ మిస్టేక్ ఉందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

 ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ పాత్రలు చనిపోతాయి అన్న సంగతి తెలిసిందే. ఇక రౌడీల దాడిలో అల్లు అర్జున్ ముఖం కాలితే రామ్ చరణ్ తల్లి డాక్టర్ కావడంతో అతని ముఖాన్ని అల్లు అర్జున్ కు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా అమరుస్తుంది. అయితే ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మారేది ముఖం మాత్రమే. కానీ ఈ సినిమాలో మాత్రం ముఖంతో పాటు వాయిస్ కూడా మారిపోయి రామ్ చరణ్ వాయిస్ వస్తుంది. ఈ విషయంలోనే దర్శకుడు పప్పులో కాలేశాడు. ఈ విషయంపై దర్శకుడు కాస్త ఆలోచించి ఉండే ఈ మిస్టేక్ జరిగేది కాదని కొంతమంది సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ బిగ్ మిస్టేక్ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: