పవన్, సాయి ధరమ్ తేజ్ మూవీ నుంచి వచ్చిన బిగ్ అప్డేట్...!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఒక రీమేక్ సినిమా కూడా ఉంది అనే సంగతి తెలిసిందే.. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్  తో కలిసి ఒక సినిమాను పవన్ కళ్యాణ్ అనౌన్స్ కూడా చేసాడు.
తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వినోదయ సీతం  రీమేక్ లో ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు.. యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో ఈ రీమేక్ మూవీ తెరకెక్కుతుందని సమాచారం.
తమిళ్ లో కూడా సముద్రఖని డైరెక్ట్ చేసి నటించిన ఈ సినిమా అక్కడ మంచి లాభాలను అయితే తెచ్చిపెట్టింది. దీంతో ఈయన దర్శకత్వంలోనే ఇక్కడ కూడా సినిమా చేస్తున్నారు. ఒరిజినల్ లో సముద్రఖని చేసిన పాత్రనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగులో చేస్తున్నాడట... ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన షూట్ ను కూడా పూర్తి చేసాడు.. ప్రస్తుతం మిగతా భాగం షూట్ జరుపు కుంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ పూర్తి కావొస్తుందని సమాచారం.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ అదిరిపోయే న్యూస్ ను అందించారు.. పవన్ కళ్యాణ్  ఈ సినిమాలో భాగం కావడంతో ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయని తెలుస్తుంది... ఇక ఈ సినిమా నుండి తాజాగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రేపు ప్రకటించబోతున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ కూడా చేసారు..
మే 18 సాయంత్రం 4 గంటల 14 నిముషాలకు ఈ అప్డేట్ ను రివీల్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసేసారట  . దీంతో పవన్ ఫ్యాన్స్ కూడా ఈ అప్డేట్ కోసం బాగా ఎదురు చూస్తున్నారు.. ఇదిలా ఉండగా పీపుల్స్ మీడియా బ్యానర్ తో కలిసి ఈ సినిమాను త్రివిక్రమ్ నిర్మిస్తున్నాడట.అలాగే త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు కూడా అందిస్తున్నారని తెలుస్తుంది.. కాగా ఈ సినిమా జులై 28న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.. విరూపాక్ష తో అదిరిపోయే హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ మామతో కలిసి మరో హిట్ అందిస్తాడో లేదో మరి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: