సుధీర్ తో అక్కడికి ఒంటరిగా వెళ్లాలని ఉంది... రష్మీ..!

Pulgam Srinivas
సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో రేష్మి గౌతమ్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత అనేక సినిమాల్లో అవకాశాలను కూడా దక్కించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో మాత్రమే కాకుండా ఇతర ముఖ్య పాత్రల్లో కూడా నటించి ప్రేక్షకులను అరవించింది.

ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఈ ముద్దు గుమ్మ అందచందాలను ఆరబోయడానికి కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారును ప్రేక్షకులను ఫిదా కూడా చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా రేష్మి ... ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్  సీజన్ 5 కి పార్టిసిపేట్ గా వచ్చింది. ఈ షో కు రష్మి తో పాటు ప్రముఖ టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కూడా విచ్చేశాడు. వీరిద్దరూ కూడా ఈ ఎపిసోడ్ లో తమ అద్భుతమైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు.

ఇది ఇలా ఉంటే ఈ రియాలిటీ షో లో భాగంగా యాంకర్ ఓంకార్ ... రేష్మీ ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు రష్మి కూడా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది.  ఓంకార్ ... రేష్మీ ని ఒక వేళ ఏ హీరో తో అయినా ఒంటరిగా ఐస్లాండ్ కు వెళ్లవలసి వస్తే ఏ హీరోతో వెళ్తావు అనే ప్రశ్నను అడిగాడు. ఈ ప్రశ్నకు రష్మీ ... సుధీర్ తో వెళ్తాను ... అలాగే సుధీర్ కంపెనీ నాకు బాగా నచ్చుతుంది అని చెప్పేసింది. తాజాగా ఈ షో లో రష్మీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రష్మీ వరుస సినిమాలతో ... టీవీ షో లతో ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: