PKSDT సినిమా విషయంలో ఫ్యాన్స్ ఆందోళన?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తు దూసుకుపోతున్నాడు.అందులో భాగంగా ఆయన వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాకు రీమేక్‌గా ఓ సినిమాను కూడా చేస్తున్నారు.మంచి కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా తమిళ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను తెలుగులో ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఇంకా నటుడు అయిన సముద్రఖని  దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా ఒరిజినల్‌లో సముద్రఖని నటించడమే కాదు ఈ సినిమాను అద్భుతంగా డైరెక్ట్‌ కూడా చేశారు. ఇక తమిళ్‌లో సముద్రఖని చేసిన పాత్రలో పవన్ కనిపిస్తుండగా.. తంబి రామయ్య అనే మరో కీలక పాత్రలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్  నటిస్తున్నాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గతంలో నటించిన గోపాల గోపాల సినిమాకు కాస్తా దగ్గరగా ఉంటుంది. అది అలా ఉంటే ఈ సినిమా టైటిల్‌ అండ్ ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం 4:14 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. దీని గురించి టీమ్ ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న ఎస్ ఎస్ థమన్ తాజాగా ఈ ఈవిషయంలో ఒక పోస్ట్ ను షేర్ చేశారు. సాయంత్రం 4:14 గంటలకు ఫైర్ అంటూ అతను చెప్పుకొచ్చారు.


ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి లేటెస్ట్‌గా ఓ వార్త వైరల్ గా మారింది. ఇంతకీ విషయం ఏమంటే.. ఈ సినిమాకు మొదట నాగార్జున సంతోషం సినిమాలో దేవుడే దిగి వచ్చిన అనే పాటను టైటిల్‌గా పెట్టనున్నారని టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాకు బ్రో అనే పేరు కంఫర్మ్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి తేజ్‌ను పవన్‌ బ్రో అని పిలుస్తారట.అందుకే ఈ సినిమాకు బ్రో అని పెట్టారట.అంతేకాదు, ఈ పేరును టీం రిజిస్టేషన్ కూడా చేశారట.అయితే నెటిజన్స్ మాత్రం ఇదేంట్రా బాబు టైటిల్ మరి ఇంత ఘోరంగా ఉందని కూడా అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు.ప్రస్తుతం ఆయన ఓజీ షూటింగ్‌లో కూడా పాల్గోంటున్నారు. ఈ వినోదయ సీతమ్ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు సాయిధరమ్ తేజ్, కేతికశర్మ, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళభరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్ ఇంకా రాజా చెంబోలు కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: