నెక్స్ట్ మంత్ పెళ్లి.. యువ హీరో ఎంగేజ్మెంట్ పై రూమర్స్..!

shami
సెలబ్రిటీల రిలేషన్ షిప్ ల మీద ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడం మీడియాకు అలవాటుగా మారింది. ఎంచక్కా ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అవుతున్న ఒక జంట గురిచి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ పెళ్లి ఆగిపోయింది అంటూ హడావిడి మొదలు పెట్టారు. తీరా చూస్తే అలాంటిది ఏమి లేదని తెలుస్తుంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి అంటే యువ హీరో శర్వానంద్ రీసెంట్ గా రక్షితని ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అది జరిగి నాలుగు ఐదు నెలలు అవుతుంది. పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ రాకపోయే సరికి ఇక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రాసేస్తున్నారు.
శర్వానంద్, రక్షిత విడిపోయారని.. పెళ్లి క్యాన్సిల్ అని రాసిన వారు ఉన్నారు. కానీ ఎంచక్కా వాళ్లు నెక్స్ట్ మంత్ పెళ్లికి రెడీ అవుతున్నారు. జూన్ 3 న శర్వానంద్, రక్షితల మ్యారేజ్ జరగబోతుంది. రాజస్థాన్ ప్యాలస్ లో వీరి పెళ్లి ఘనంగా జరగబోతుంది. టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరు ఈ పెళ్లికి అటెండ్ అవుతారని తెలుస్తుంది. అయితే పెళ్లి అక్కడ చేసుకున్నాక హైదరాబాద్ లో ఒక మంచి రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. శర్వానంద్ ఈ రిసెప్షన్ ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. శర్వానంద్ రాం చరణ్ ఇద్దరు మంచి స్నేహితులు.. శర్వానంద్ పెళ్లికి ఎవరు వచ్చినా రాకపోయినా చరణ్ మాత్రం తప్పకుండా పెళ్లికి అటెండ్ అవుతాడని చెప్పొచ్చు.
ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి పెళ్లి పనులు చూసుకుంటున్నాడట శర్వానంద్. పెళ్లి తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్లీ షూటింగ్ లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు. మొత్తానికి శర్వానంద్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: