మహేష్ న్యూ లుక్ మాములుగా లేదుగా...!

murali krishna
మహేష్ బాబు సినిమా షూటింగ్ విరామంలో అయితే ఉన్నారు. ఎస్ఎస్ఎంబి 28 నెక్స్ట్ షెడ్యూల్ కి గ్యాప్ రాగా మహేష్ వెకేషన్ కు వెళ్లారట.ఈ స్టార్ హీరో తన లేటెస్ట్ లుక్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.
మెస్సి హెయిర్ మరియు గడ్డంతో కూడిన మహేష్ సరికొత్తగా అయితే ఉన్నారు. మహేష్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో క్షణాల్లో తెగ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఎంతో క్రేజీగా ఫీల్ అవుతున్నారు.
ఇక ఎస్ఎస్ఎం బి 28 చిత్ర షూటింగ్ జూన్ మొదటివారం నుండి తిరిగి ప్రారంభం కానుందని తెలుస్తుంది.మూడు నెలలు గ్యాప్ లేకుండా ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ నందు చాలా వరకు షూటింగ్ కంప్లీట్ కానుందని తెలిస్తుంది.. 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సమయం తక్కువగా ఉంది. అందుకే మేకర్స్ బిజీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఈ చిత్ర టైటిల్స్ విషయంలో అనేక ఊహాగానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు అలాగే ఊరికి మొనగాడు... ఇలా పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఫైనల్ గా ఏది నిర్ణయిస్తారనేది అయితే చూడాలి. ఈ చిత్రంలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. శ్రీలీల మరొక హీరోయిన్ గా అయితే నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు.
మరోవైపు మహేష్ దర్శకుడు రాజమౌళి మూవీకి కూడా సన్నద్ధం అవుతున్నారు. ఈ ఏడాది చివర్లోనే ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తుంది.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ కథ ను సమకూర్చారు. జంగిల్ అడ్వెంచర్ జానర్లో తెరకెక్కనుందట.. ఈ చిత్ర బడ్జెట్ రూ. 800 కోట్లు అని తెలుస్తుంది.. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో మహేష్ 29వ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: