గేట్ రెడీ: ఓటిటిలోకి రాబోతున్న విరూపాక్ష..!!

Divya
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష.. ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త మీనన్ నటించింది. ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన తెలుగులో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లో వసూళ్లను రాబట్టింది ఎప్పటిలాగా కాకుండా మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రూ.32 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. సాయి ధరంతేజ్ కెరియర్ లోని రూ.40 కోట్ల షేర్ రాబట్టిన మొదటి సినిమాగా విరూపాక్ష చిత్రం నిలిచింది.

ఈ సినిమా విడుదలైన తర్వాత కొత్త సినిమాలు ఎన్ని విడుదలైనా కూడా ఫ్లాప్ గా నిలుస్తూ ఉండడంతో విరూపాక్ష సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని భాషలలో కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది కలెక్షన్ల పరంగా కూడా భారీగానే దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అప్డేట్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటి లో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రముఖ నెట్ ఫ్లిక్స్ ఓటిటి సంస్థ ఈ ఓటిటి హక్కులను సొంతం చేసుకుంది.
మే 21వ తేదీన ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు సమాచారం ఇప్పటికే థియేటర్ల వద్ద చూసిన వాళ్లతో పాటు థియేటర్లో చూడని వాళ్లను ఈ సినిమా చూడాలని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరొకవైపు ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ స్టార్ మా దక్కించుకున్నట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఏ సినిమా స్టార్ మా హక్కు అన్ని భాషలలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రంలో ప్రముఖ బుల్లితెర నటుడు కూడా కీలకమైన పాత్రలో నటించారు అలాగే శ్యామల బ్రహ్మాజీ సాయి చందు తదితరులు కూడా నటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: