"భద్ర" మూవీని ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజ కెరియర్ లో అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సినిమాలలో భద్ర మూవీ ఒకటి. ఈ మూవీ కి టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా ... మీరా జాస్మిన్ ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ తో బోయపాటి శ్రీను దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కథను మొదట రవితేజ కంటే ముందు బోయపాటి ముగ్గురు స్టార్ హీరోలకు వినిపించారట. ఆ ముగ్గురు స్టార్ హీరోలు ఎవరూ..? ఈ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుసుకుందాం. బోయపాటి శ్రీను మొదట ఈ కథను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించాడట. ఈ మూవీ కథ ఎన్టీఆర్ కు చాలా బాగా నచ్చినప్పటికీ బోయపాటికి డైరెక్టర్ గా ఇదే మొదటి సినిమా కావడంతో కాస్త ఆలోచనలో పడ్డ ఎన్టీఆర్ ఈ మూవీ పూర్తి అయిన తర్వాత రెండవ సినిమా చేద్దాం అని చెప్పాడట.

ఆ తర్వాత ఇదే కథను అల్లు అర్జున్ కు వినిపించగా అప్పటికే ఆర్య సినిమాతో బిజీ గా ఉన్న అల్లు అర్జున్ కూడా ఈ మూవీలో నటించ లేకపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభాస్ ము ఈ మూవీ కథను వినిపించగా చక్రం మూవీతో ప్రభాస్ బిజీగా ఉండడం వల్ల ఈ మూవీలో నటించలేకపోయినట్లు తెలుస్తోంది. చివరగా రవితేజకు ఈ కథను వినిపించగా ఈ నటుడుకి ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: