ఆఖరి షెడ్యూల్ కి సిద్ధం అవుతున్న ప్రాజెక్ట్ కె టీం...!!

murali krishna
రెబల్ స్టార్ ప్రభాస్  హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్ కే సినిమా చివరి షెడ్యూల్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సంగతి తెల్సిందే.
భారీ వసూళ్లు ఈ సినిమాను దక్కించుకుంటుంది అంటూ మేకర్స్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. మహానటి చిత్రం తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెల్సిందే.
ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ ప్రారంభించి చాలా కాలం అయితే అయ్యింది. కానీ ఇప్పటి వరకు షూటింగ్ ముగించలేక పోయారు. ప్రభాస్ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం వల్ల సినిమా ను ఆలస్యం చేస్తున్నట్లుగా సమాచారం.. ప్రారంభించిన సమయంలో సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావించారని తెలుస్తుంది.. కానీ ఇప్పటి వరకు సినిమా యొక్క చివరి దశ షూటింగ్ పూర్తి అయితే కాలేదు. వచ్చే ఏడాది లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల అవ్వబోతున్న సంగతి తెల్సిందే. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ప్రాజెక్ట్ కే సినిమా చిత్రీకరణ జులై వరకు పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.. సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కాస్త ఎక్కువగా ఉంటుందట. అందుకే సినిమాను భారీ అంచనాల నడుమ రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ కూడా చెప్పుకొచ్చారు. ఈ సినిమా లో భారీ ఎత్తున సినిమా వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తుంది.అందుకే కాస్త ఎక్కువ సమయం కేటాయించాలని ఆయితే వారు భావిస్తున్నారు. అందుకే దాదాపు నాలుగు నుండి అయిదు నెలల పాటు షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా వీఎఫ్ఎక్స్ వర్క్ చేయబోతున్నారట.. అమితా బచ్చన్ ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ఏడాది సలార్ మరియు ఆదిపురుష్ సినిమా లు విడుదల కాబోతున్న సంగతి తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: