ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లపై స్పై యాక్షన్ ధ్రిల్లర్ మూవీ..?

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ లు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే హిందీ లో మరో భారీ బడ్జెట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందబోతున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లుగా కెరియర్ ను కొనసాగిస్తున్న దీపికా పదుకొనే ... కత్రినా కైఫ్ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో మెయిన్ లీడ్ లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి ఎస్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వారు భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సంస్థ దీపికా పదుకొనే ... కత్రినా కైఫ్ లతో భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ ని రూపొందించడం కోసం కథలను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. సరైన కథ కనుక దొరికినట్లు అయితే వెంటనే వీరిద్దరి కాంబినేషన్లో ఒక భారీ బడ్జెట్ స్పై థ్రిల్లర్ మూవీ ని మొదలు పెట్టే ఆలోచనలో ఈ మూవీ నిర్మాణ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ లో కెరీర్ ను మొదలు పెట్టిన కత్రినా కైఫ్ ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసి ఎన్నో విజయాలను హిందీ పరిశ్రమలో అందుకొని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ ను కెరియర్ ను కొనసాగిస్తుంది.

ప్రస్తుతం కూడా కత్రినా బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇలా ఉంటే దీపిక ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ హిందీ మూవీ లలో నటించి హిందీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టు కే అనే పాన్ వరల్డ్ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తో పాటు మరి కొన్ని భారీ బడ్జెట్ సినిమాలలో కూడా దీపిక హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: