పెళ్లి విషయంలో నేను ఆ పని చేయలేదు : ఖుష్బు

murali krishna
ఖుష్బూ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోవడం లేదనే విషయం తెలిసిందే.
ఖుష్బూకు కెరీర్ పరంగా భారీ సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. అయితే ది కేరళ స్టోరీ మూవీ గురించి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు  అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా వల్ల లవ్ జిహాద్ అంశం గురించి దేశమంతటా కూడా చర్చ జరుగుతోంది.
అయితే ఖుష్బూ గతం లో మతం మారారనే విషయం తెలిసిందే. కొంతమంది కావాలని ఖుష్బూను టార్గెట్ చేస్తూ ది కేరళ స్టోరీ సినిమా వల్ల విమర్శలు చేస్తుండగా ఆమె స్పందించి తనదైన శైలిలో జవాబు ఇచ్చారట.. పెళ్లి కోసం నేను మతం మారినట్టు ప్రచారం చేసేవాళ్లు కొంచెం తమ జ్ఞానాన్ని పెంచుకోవాలని ఖుష్బూ తెలిపారు. మన దేశంలో ఉన్న వివాహ చట్టం గురించి కచ్చితంగా వాళ్లకు అస్సలు తెలిసుండదని ఖుష్బూ పేర్కొన్నారు.
పెళ్లి కోసం నేను ఏ ఒక్క మతానికి మారలేదని మతం మారాలని నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదని కూడా ఆమె చెప్పుకొచ్చారు. నా 23 సంవత్సరాల పెళ్లి జీవితం, గౌరవం, నమ్మకం, సమానత్వం ప్రేమకు ప్రతీకగా ఉంటుందని ఖుష్బూ కామెంట్లు చేయడం విశేషం.. ఖుష్బూ స్పందించి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఆమెను విమర్శించే వాళ్లు ఇకనైనా సైలెంట్ అవుతారేమో చూడాలి మరి..
ఖుష్బూ భర్త పేరు సుందర్ అనే విషయం తెలిసిందే. నటి ఖుష్బూ తాజాగా ది కేరళ స్టోరీ మూవీ అందరూ చూడాల్సిన మూవీ అని చెప్పుకొచ్చారు. అబద్ధపు కారణాలతో తమిళనాడు ప్రభుత్వం ఈ సినిమాపై బ్యాన్ విధించిందని ఆమె చెప్పుకొచ్చారట.. ఖుష్బూ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఖుష్బు ప్రస్తుతం కొన్ని పెద్ద సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా చేస్తుంది. అప్పుడప్పుడు జబర్దస్త్ లో కూడా ఆమె మెరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: