అఫీషియల్ : పంజా వైష్ణవ్ తేజ్ 4వ మూవీలో క్రేజీ నటి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరో లు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరో లు ఎంట్రీ ఇస్తున్నప్పటికీ వారిలో కొంత మంది మాత్రమే మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో పంజా వైష్ణవ్ తేజ్ ఒకరు. ఈ నటుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందినటు వంటి ఉప్పెన మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలో ప్రతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.
 

ఈ మూవీ తర్వాత ఈ నటుడు కొండపొలం ... రంగ రంగ వైభవంగా అనే రెండు సినిమా లలో హీరో గా నటించాడు. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ నటుడు తన కెరియర్ లో 4 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ లో క్రేజీ బ్యూటీ అపర్ణ దాస్ నటించబోతున్నట్లు ... అలాగే ఈ మూవీ లో ఈ నటి వజ్ర కాలేశ్వరి దేవి పాత్రలో కనిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అపర్ణ దాస్ ఇప్పటికే అనేక మలయాళ ... తమిళ మూవీ లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: