స్టార్ హీరో కూతుర్ల ఇంటినే టార్గెట్..!!

Divya
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుసగా షాక్ తగులుతూనే ఉన్నాయి. మొన్న పెద్ద కూతురు ఇంట్లో భారీగా దొంగతనం జరగక తాజాగా నిన్నటి రోజున చిన్న కూతురు ఇంట్ల చోరీ జరిగిందనే విషయాన్ని సౌందర్య తెలియజేసింది.. ముఖ్యంగా తన SUV కారుకి కనిపించడం లేదంటూ సౌందర్య రజనీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. చెన్నైలోని తేనంపేట పోలీస్ స్టేషన్లు ఈ ఫిర్యాదు నమోదు అయినట్లుగా సమాచారం.

ఒక ప్రైవేటు కాలేజ్ లో జరిగిన ఫంక్షన్కు వెళ్లిన ఈమె అక్కడి నుంచి  తిరిగి వచ్చేలోగా తన కార్ కి కనిపించకుండా పోయింది అని సౌందర్య ఫిర్యాదు చేయడం జరిగింది.. ఇటీవల రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. చెన్నైలోని తన ఇంట్లో ఉండే బంగారం వజ్రా భారణాలకు చోరీ గురైనట్లుగా ఆమె ఫిర్యాదు చేసింది ఇది జరిగిన నెలన్నరకు రజనీకాంత్ కూతురు సౌందర్య ఇంట్లో దొంగతనం జరిగింది. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రజనీకాంత్.

అంతేకాకుండా గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ గురించి మాట్లాడి తెగ వైరల్ గా మారారు అంతేకాకుండా పలు రకాలుగా రజనీకాంత్ పైన ట్రోల్ కూడా చేయడం జరుగుతోంది. మార్చి నెలలో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లో 60 లక్షల విలువైన నగదు చోరీ చేయగా ఈ చోరీ తన ఇంట్లో పనిమనిషి ఈశ్వరి ,లక్ష్మీ, డ్రైవర్ వెంకట ల పైన అనుమానం ఉందని ఫిర్యాదులు తెలియజేశారు.. దీంతో ఆమె ఇంట్లో పని చేస్తున్న ఈ ముగ్గురి ఈ చోరీకి పాల్పడ్డారని సమాచారం దొంగలించిన ఆభరణాలను అమ్మి ఆ డబ్బుతో చెన్నైలో ఒక ఇల్లుతో పాటు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినట్లు సమాచారం. మరి వీరు చేస్తున్న నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని పలువురు నెటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. వీరి వల్ల రజనీకాంత్ కు ఇబ్బంది అవుతోందని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: