నితిన్ కు ఎమోషనల్ స్టోరీ చెప్పిన వేణు...!!

murali krishna
కమెడియన్ వేణు డైరెక్టర్ గా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వచ్చిన సినిమా బలగం.. ఈ సినిమా గత రెండు నెలలుగా టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా అయితే నిలిచింది…
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం ను సాధించింది .. అంతేకాదు ఆడియెన్స్ ఈ కధని కనెక్ట్ అయిన తీరు .. సినిమా పట్ల ప్రజలకు ఇంత ఆదరణ ఉంటుందా అనే ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది .. ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో సంస్కృతి , సంప్రదాయాలను బలగం సినిమాలో అద్భుతంగా చూపించారు. జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ..ఈ బలగం సినిమాతో దర్శకుడిగానూ అంతే గుర్తింపు ను తెచ్చుకున్నాడు... వేణు బలగం తెరకెక్కించిన విధానానికి అందరూ కూడా ఫిదా అవుతున్నారు...
ఆ సినిమా హిట్ అవ్వడం తో వేణుకి పలు ఆఫర్లు వస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది... ఇక రీసెంట్ గా వేణు హీరో నితిన్ ని  కలిసి ఒక అద్భుతమైన కథని కూడా వినిపించాడని ఆ కథ విన్న తర్వాత నితిన్ భావోద్వేగానికి గురయ్యారని, ఈ సినిమా తప్పకుండా చేస్తున్నామని అయితే చెప్పారని సమాచారం... అంతేకాదు, ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చెయ్యాలని కూడా అన్నారని టాక్. తనకు ఉన్న కమిట్ మెంట్స్ పూర్తి కాగానే ఈ సినిమాకి డేట్స్ ను ఇస్తాను అని కూడా నితిన్ చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుతం వేణు ఆ స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని సమాచారం..ఇప్పుడు వేణు లాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ ని కూడా నితిన్ ప్రోత్సహిస్తున్నాడని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా కూడా మంచి హిట్ అయితే వేణు పెద్ద డైరెక్టర్ గా పేరును సంపాదించుకుంటాడు... ఇక, బలగం సినిమా అయితే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. భారీ విజయాన్ని అందుకుంది. నిర్మాతకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టడమే కాకుండా పలు అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: