కస్టడీ మూవీ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే..?

Divya
అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ.. ఈ సినిమా డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వం వహించగా హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. అలాగే కీలకమైన పాత్రలో ప్రియమణి నటించగా.. అరవింద స్వామి విలన్ గా నటిస్తూ ఉన్నారు. నాగచైతన్యకు సరైన సక్సెస్ లేక చాలా కాలం అవుతోంది ..ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్ ట్రైలర్ ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. కాఫ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులకు పాజిటివ్ బజ్ ఏర్పడుతోంది.
ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా ముగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ యూఎస్ సర్టిఫికెట్ జారీ చేయక ఈ సినిమా రన్ టైం..2:27 నిమిషాలు ఫిక్స్ అయినట్లుగా చిత్ర బృందం తెలియజేసింది. ఇందులో నాగచైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్ర లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్ లో నటన ఉన్నట్లుగా తెలుస్తోంది. కృతి శెట్టి కూడా ఈ సినిమా లో అద్భుతంగా నటించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమెకు కూడా సరైన సక్సెస్ లేక చాలా కాలం అవుతోంది. మరి ఈ సినిమాతో నైనా వీరిద్దరి జాతకాలు మారతాయేమో చూడాలి మరి.

తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొంటున్న చిత్ర బృందం పలు రకాల విషయాలను కూడా తెలియజేస్తోంది. నాగచైతన్య ,సమంత నుండి ఎందుకు విడిపోవలసి వచ్చిందని విషయాన్ని కూడా తెలియజేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈనెల 12 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి అక్కినేని కుటుంబంలో ఏ ఒక్కరి హీరో సినిమా కూడా సక్సెస్ కాలేక పోతోంది. మరి అలాంటి సెంటిమెంటును నాగచైతన్య ఈ సినిమాతో చెరిపేస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: