నేటితో మహేష్ "మహర్షి" మూవీకి నాలుగేళ్లు..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అదిరిపోయే సాలిడ్ బ్లాక్ బాస్టర్ విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే మహేష్ కెరియర్ లో సూపర్ హిట్ విజయం సాధించిన మూవీ లి ఎన్నో ఉన్నాయి. అలా మహేష్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను సాధించిన సినిమాలలో మహర్షి మూవీ ఒకటి.
 

ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... యంగ్ బ్యూటీ పూజా హెగ్డే ఈ మూవీ లో మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 9 మే 2019 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా రాబట్టింది.

ఇలా ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా నేటితో నాలుగు సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీ లో మహేష్ స్టూడెంట్ గా ... ఒక పెద్ద కంపెనీకి సీఈఓ ఆఫీసర్ గా మరియు ఊరిలో రైతుగా ఇలా మూడు విభిన్నమైన పాత్రలో కనిపించి మూడు పాత్రల్లో కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించాడు. ఈ మూవీ లోని మహేష్ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు అందాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: