ఓంకార్ సిక్స్త్ సెన్స్ లో.. సుధీర్ గురించి ఓపెన్ అయిన రష్మీ?

praveen
సాధారణంగా వెండితెరపై ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తే.. ఇక ఆ సినిమాలు సూపర్ హిట్ సాధిస్తే ప్రేక్షకులందరికీ కూడా ఆ హీరో హీరోయిన్ జంట ఫేవరెట్ జోడీగా మారిపోతూ ఉంటుంది. ఇక ఆ జోడి ఎప్పుడు రిపీట్ అయినా కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో సినిమాలను వీక్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే కేవలం వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా అదే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న జోడి ఏది అంటే ప్రతి ఒక్కరు చెప్పేస్తారు రష్మీ,సుధీర్ జోడి అని. జబర్దస్త్ ద్వారా మొదలైన వీరి జోడి ప్రయాణం బుల్లితెర మొత్తం పాకిపోయింది.

 ఇక వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్  కోట్ల మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. దీంతో వీరిద్దరూ ఎక్కడైనా కలిసి స్టేజి మీద కనిపించారు అంటే చాలు చూసి మురిసిపోయే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఆనందపడే అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక సుధీర్ జబర్దస్త్ నుండి తప్పుకోవడంతో ప్రస్తుతం రష్మీ సుధీర్ జోడిని ఒకే చోట చూడలేకపోతున్నారు ఫ్యాన్స్. కానీ వీరికి సంబంధించిన వార్త మాత్రం ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంది.

 ఈ క్రమంలోనే ఇటీవలే ఒక షోలో పాల్గొన్న యాంకర్ రష్మీ ఏకంగా సుదీర్ తో లవ్ మేటర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ అనే కార్యక్రమంలో పాల్గొంది రష్మీ. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒకసారి ఈ ప్రోమో చూసుకుంటే.. అవును నిజమే సుదీర్ పక్కనుంటే చాలా బాగుంటుంది అంటూ రష్మి చెప్పింది. దీంతో సుదీర్ ను మిస్ అవుతున్నాను అని చెప్పకనే చెప్పింది. అయితే రష్మీ ఇలా అన్న తర్వాత ఇక వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉందని ఎవరు చెప్పారు.. పక్క ప్రేమే అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: