"పుష్ప 2" ఆడియో రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడు పోయాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ఆఖరుగా పార్ట్ 1 మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మలయాళ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటలలో ఒకరు అయినటు వంటి ఫాహధ్ ఫజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... సునీల్ , అనసూయ , రావు రమేష్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు.


 దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు  ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క మొదటి భాగం మంచి విజయం సాధించడంతో రెండో భాగంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ యొక్క రెండవ భాగం షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి ఒక వీడియోని విడుదల చేయగా ... ఆ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా అమ్ముడుపోని ధరకు ఈ మూవీ ఆడియో హక్కులు అమ్ముడుపోయినట్లు ... ఏకంగా ఈ సినిమా ఆడియో హక్కులను 65 కోట్లకు ఒక ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యొక్క మొదటి భాగం పాటలు అద్భుతమైన విజయం సాధించడంతో ... ఈ మూవీ రెండవ భాగం పాటలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: