మహేష్ సినిమాలో నటించబోతున్న మమ్ముట్టి...!!

murali krishna
మహేష్ బాబు మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్కు తోడు హ్యాండ్సమ్ లుక్స్తో కూడా అదరగొట్టేసి స్టార్ హీరోగా మారాడు....అప్పటి నుంచి స్టార్ హీరో గా దూసుకుపోతున్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు మహేశ్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ను చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి అయితే బయటకు వచ్చింది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు మూడో సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే మరియు శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే ప్రకాష్ రాజ్,సాయి కుమార్,సోనూసూద్,మమ్ముట్టి లాంటి స్టార్ నటులు ఈ సినిమాలో ఉన్నట్టుగా సమాచారం...ఇక తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి మమ్ముట్టి వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నట్టు గా సమాచారం..
రెండు క్రేజీ సినిమాల తర్వాత మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితం అయితే మొదలైంది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు. తర్వాత కొన్ని ఆటంకాలు అయితే ఎదురయ్యాయి. అయినా దాని తర్వాత నుంచి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ముందుగా అయితే ప్రకటించింది. కానీ, షూటింగ్ సజావు గా సాగని కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి... అందుకు అనుగుణంగానే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వస్తున్నట్లు సమాచారం... దీనికి సంబంధించిన పోస్టర్ను కూడా చిత్ర యూనిట్ ఇటీవలే విడుదల చేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: