Ycp నాయకుల పై ఫైర్ అవుతున్న రజిని అభిమానులు..!!

Divya
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ఇటీవలే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు విజయవాడకు హాజరు కావడం జరిగింది. అయితే రజనీకాంత్ కు ఎప్పటినుంచో బాలకృష్ణ ఎన్టీఆర్ తో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పవచ్చు. చంద్రబాబుతో కూడా రజనీకాంత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి.విజయవాడలో జరిగిన ఈ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీకాంత్ చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడును బాలయ్యను పొగడడం జరిగింది.అలాగే వారితో ఉన్న స్నేహం గురించి కూడా తెలియజేశారు.

గత రెండు రోజుల నుంచి వైసీపీ నాయకులు రజినీకాంత్ పైన ఫైర్ అవుతున్నారు. అసలు రజనీకాంత్ వైసీపీ గురించి కానీ జగన్ గురించి కానీ వైసిపి నాయకుల గురించి గానీ ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. ఎన్టీఆర్ వేడుకలకు వచ్చాడు కాబట్టి ఎన్టీఆర్ పాటలు అక్కడ స్టేజ్ పైన ఉన్న వారి గురించి మాట్లాడడం జరిగింది. కానీ చంద్రబాబును పొగిడినందుకు వైసిపి నాయకులు కొడాలి నాని, రోజా , పేర్ని నాని ,మధుసూదన్ రెడ్డి ఇలా ఎంతోమంది నాయకులు రజినీకాంత్ ను చాలా దారుణంగా విమర్శించారు.

దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు రజినీకాంత్ రేంజ్ తో పోలిస్తే ఈ వైసీపీ నాయకులు ఎవరు కూడా రజనీకాంత్ కి సరితూగరు దేశ విదేశాలలో కూడా అభిమానులు ఉన్నారు. రజిని పేరు ప్రఖ్యాతలు సంపదలు అన్ని కష్టపడి సంపాదించుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న రజిని అభిమానులు వైసిపి నాయకుల పైన ఫైర్ అవుతున్నారు వైసిపి రజనీకాంత్ కి సారీ చెప్పాలని #YSRCP Apologize Rajini అనే హ్యాండ్ తో పోస్టులు షేర్ చేయడం జరుగుతోంది. ఏకంగా ఈ హ్యాష్ టాగ్ ట్విట్టర్ల రెడీగా మారిపోయింది అంటే రజనీకాంత్ అభిమానులు ఎలా చేస్తున్నారో అర్థమవుతుంది. మరి ఈ విషయంపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: