ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రోజా రమణి...!!

murali krishna
టాలీవుడ్ నటీమణుల లో ఒకరైన రోజా రమణి కూడా ఒకరు.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను అయితే చెప్పుకొచ్చారు. నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రోజా రమణి పాపులారిటీ సంపాదించుకున్నారనే విషయం తెలిసిందే.
భక్త ప్రహ్లాద సినిమాలో  బాలనటిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన రోజా రమణి ఒరియా రీమేక్ సినిమా లలో ఎక్కువ గా నటించి ఆకట్టుకున్నారు. ఈతరం ప్రేక్షకులకు హీరో తరుణ్ తల్లిగా ఆమె సుపరిచితం అనే విషయం తెలిసిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన రోజా రమణి సీనియర్ ఎన్టీఆర్  గురించి ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. సీనియర్ ఎన్టీఆర్ అంటే నాకు ఎంతో అభిమానం అని కూడా ఆమె అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించడం అదృష్టం అని ఆమె చెప్పుకొచ్చారు. తాతమ్మ కల సినిమాలో తొలిసారి సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించానని రోజా రమణి కామెంట్లు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ తో నాలుగైదు సినిమాలు చేశానని కూడా ఆమె తెలిపారు.
ఒక మూవీ షూటింగ్ లో భాగం గా ఆత్మహత్య చేసుకోవడానికి నేను పరుగెత్తుతుండగా ఆగు చెల్లెమ్మా అంటూ హరికృష్ణ వెనకే వస్తున్నారని ఆ సినిమాకు సీనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ అని రోజా రమణి చెప్పుకొచ్చారట.. కృష్ణా బ్యారేజీ రెయిలింగ్ పై ఖాళీ క్యాన్ల మీద నేను నిలబడ్డానని ఆ క్యాన్లు ఊగుతుండటంతో రామారావు వచ్చి నా కాళ్లు పడిపోకుండా పట్టుకున్నారని రోజా రమణి చెప్పుకొచ్చారు.
కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అక్కడ సూసైడ్ జరుగుతుందని రోజా రమణి చెప్పుకొచ్చారు.. వేల సంఖ్యలో జనం ముందు ఏ మాత్రం ఆలోచించకుండా రామారావు గారు నా కాళ్లు పట్టుకున్నారని రోజా రమణి వెల్లడించారు. రోజా రమణి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. రోజా రమణి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: