నాసిరకం కథలతో హీరోలను ముంచేస్తున్న దర్శకులు...!!

murali krishna
దేశంలో ఏ సినీ పరిశ్రమకైనా డిజాస్టర్లు రావడం సహజం. వీటిని చూడని హీరోలు ప్రపంచ చరిత్రలో అయితే ఉండరు. కానీ ఒకప్పుడు ఇలాంటి ప్రతికూల ఫలితాలు నిర్మాతలకు విపరీతమైన నష్టాలను కలిగించేవి కాదు.
ఎందుకంటే సినిమా బాలేదని తెలిసినా ఎంటర్ టైన్మెంట్ కు ఆప్షన్ లేదు కాబట్టి సర్దుకుని అంతో ఇంతో ప్రత్యేకంగా ఒక వర్గం ఆడియన్స్ వీటిని చూసేవాళ్ళు అయితే వున్నారు.. కానీ రోజులు అయితే మారాయి.
తాజాగా ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద మొదటి ఆటకే చేతులెత్తేసిందట.అఖిల్ కష్టమంతా దర్శకుడు సురేందర్ రెడ్డి నాసికరం దర్శకత్వంలో వృథా అయిపోయిందని తెలుస్తుంది.రెండో రోజే తల్లి అమల ఇన్స్ టాలో ఓదార్పు చెప్పాల్సి అయితే వచ్చింది. ఆరు పలకల దేహం, కాకినాడ షాపింగ్ మాల్ పైఅంతస్థు అంత ఎత్తు నుంచి దూకినా కూడా లాభం లేకపోయింది. కొంచెం వెనక్కు వెళ్తే లైగర్ విషయంలో విజయ్ దేవరకొండ చూపించిన ఉత్సాహం, కమిట్ మెంట్ పూరి జగన్నాధ్ తప్పిదాల వల్ల మొత్తం పాన్ ఇండియా లెవెల్ లో పరువు పోయింది.
అంతకు ముందు నాగ శౌర్య ఇదే తరహాలో లక్ష్య కోసం విపరీతంగా శారీరక శ్రమ తీసుకుని సంతోష్ జాగర్లపూడిని నమ్మితే అది నిలువునా నిర్మాతలకు ముంచేసిందట.. ఈ కుర్ర హీరోల ఇంతగా తాపత్రయపడి రిస్కులకు సిద్ధపడటం మంచిదే. కానీ అవి సరైన కథలకు సినిమాలకు అయితే ఉపయోగపడాలి. అంతే తప్ప నాసిరకం కంటెంట్ తో కనీసం ఫ్యాన్స్ నైనా మెప్పించలేనప్పుడు అస్సలు ప్రయోజనం ఏముంది.
తప్పు ఎవరిదైనా చివరిగా బాధితులుగా మిగిలేది మాత్రం ముందు నిర్మాతలే. కెరీర్ పరంగా డైరెక్టర్ కు కూడా దెబ్బ పడుతుంది. స్టార్ దర్శకుడైతే ఇంకో అవకాశం సులభం గా దక్కుతుంది. కానీ మార్కెట్ లో ఇమేజ్ దెబ్బ తిన్న హీరోల మీద పెట్టుబడుల మొత్తం అయితే తగ్గుతూ పోతుంది. యాభై కోట్లు పెట్టడానికి రెడీ అయిన ప్రొడ్యూసర్ ఫ్లాపులు చూశాక ముప్పై కంటే రిస్క్ చేయలేను అని అంటాడు. అప్ కమింగ్ మీడియం రేంజ్ స్టార్లకు ఇది చాలా ఇబ్బంది ని కలిగిస్తుంది. ఇకనైనా కండలు చూపించే సినిమా కాకుండా సత్తా చాటే స్క్రిప్ట్ ల మీద శ్రద్ధ పెడితే అద్భుతాలు అయితే చేయొచ్చు. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: