ఆ హీరోయిన్ కి ఫోన్ చేసి.. తారక్ సారీ చెప్పాడట తెలుసా?

praveen
ఇటీవల కాలంలో ఎన్టీఆర్ పేరు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మారుమోగిపోతుంది అన్న విషయం తెలిసిందే. దీనికి కారణం త్రిబుల్ ఆర్ అనే సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోవడమే. త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు అటు ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచ సినీ ప్రేక్షకులందరూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూశారు అని చెప్పాలి. దీంతో అటు ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

 అయితే కేవలం ఇండియన్ డైరెక్టర్ మాత్రమే కాదు హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇక తారక్ క్రేజ్ ఎక్కడ వరకు పాకిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే తారక్ ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. తనది తప్పు ఉంది అని భావిస్తే నిర్మొహమాటంగా సారీ చెప్పడానికి కూడా సిద్ధమవుతూ ఉంటాడు. ఇక ఇలాగే ఒకానొక సమయంలో తారక్ ఒక హీరోయిన్ కి క్షమాపణలు చెప్పాడట. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో యమదొంగ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ సాధించింది.

 ఈ సినిమాలో ప్రియమణితో పాటు మమత మోహన్ దాస్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలో తాత ఎన్టీఆర్ సినిమాలోని ఓలమ్మి  తిక్క రేగిందా అనే సాంగ్ ని రిమిక్స్ చేశారు  ఈ పాటలో మమతా మోహన్ దాస్ బ్యాక్ ని వాయించి వదిలేస్తాడు తారక్. నిజానికి డైరెక్టర్ రాజమౌళి చెప్పినందుకు తారక్ అలా చేశాడు. అయితే ఇలా చేసినందుకు హీరోయిన్ మమతా మోహన్ దాస్ ఎక్కడ హర్ట్ అయిందో అని ఫీల్ అయ్యాడట తారక్  దీంతో వెంటనే ఆమెకు ఫోన్ చేసి మరి సారీ చెప్పాడట. అయితే తాను ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోకున్నప్పటికీ తారక్ సారి చెప్పిన విధానం మాత్రం సో క్యూట్ అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మమత మోహన్ దాస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ntt

సంబంధిత వార్తలు: