తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సాయి పల్లవి...!!

murali krishna
ప్రేమమ్ సినిమా తో హీరోయిన్ గా దక్షిణాది ఆడియన్స్ ని మెప్పించిన సాయి పల్లవి తెలుగు లో ఫిదా చిత్రం తో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సంగతి తెలిసిందే.
శేఖర్ కమ్ముల  చిత్రాలు హీరోయిన్స్ కి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కనుక ఆయన దర్శకత్వం లో మరో సినిమా ను కూడా సాయి పల్లవి చేసింది. సాయి పల్లవి కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తుంది.అలాగే కంటిన్యూ అయినా బాగానే ఉండేది కానీ సాయి పల్లవి గత సంవత్సర కాలంగా కొత్త సినిమాలకు మాత్రం కమిట్ అవ్వడం లేదు. తెలుగు లో ఆమె ఒక్క సినిమా కూడా ప్రస్తుతం చేయడం లేదు. వచ్చిన అవకాశాలు అన్నింటిని కూడా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చిందట.. ఏకంగా మూడు కోట్ల పారితోషకం ఆఫర్ చేసిన కూడా ఆమె ప్రస్తుతానికి తాను సినిమాలు చేసే మూడ్ లో లేనట్టు తిరస్కరించినట్లు ఆ మధ్య ప్రచారం జరుగింది.
సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి దూరమైనట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సాయి పల్లవి తిరిగి వస్తుందని కూడా భావించారు. సాయి పల్లవి అభిమానులు కోరుకున్నట్లుగానే ఆమె తిరిగి నటించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.ఇటీవల ఒక తమిళ సినిమా లో నటించేందుకు ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతే కాకుండా తెలుగు లో కూడా ఆమె నటించేందుకు ఓకే చెప్పిందని వార్తలు కూడా వస్తున్నాయి. అతి త్వరలోనే తెలుగు లో ఆమె సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక సాయి పల్లవి తనకు నచ్చిన కథలు వస్తే వెంటనే సినిమాలకు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆమె సన్నిహితులు కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగానే కమర్షియల్ చిత్రానికి దూరంగా ఉంటూ పాత్ర కు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు చేసుకుంటూ వెళ్లాలని సాయి పల్లవి అనుకుంటుంది అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: