ఆ వార్త నిజం అయితే రామ్... పూరి జగన్నాథ్ కాంబినేషన్ మూవీపై హిప్ భారీగా పెరిగినట్లే..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో రామ్ పోతినేని ఒకరు. ఈ యువ హీరో ఆఖరుగా ది వారియర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో రామ్ తన కెరీర్ లో మొట్ట మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాలు నడుమ తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఈ యువ హీరో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో ఇది వరకు ఈస్మార్ట్ శంకర్ అనే మూవీ రూపొందింది. అలాగే ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇలా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ ఈస్మార్ట్ శంకర్ మూవీ కి సీక్వెల్ గా రూపొందబోతుంది అని అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఒక వేళ ఈ వార్తలే కనుక నిజం అయ్యి ఈ సినిమా ఈస్మార్ట్ శంకర్ మూవీ కి సీక్వెల్ గా రూపొందినట్లు అయితే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో ఈస్మార్ట్ శంకర్ మూవీ కి సీక్వల్ గా మూవీ రూపొందబోతుందా ... లేక పోతే వేరే ఏదైనా సినిమా రూపొందుతుందా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: