పవన్ డైరెక్టర్ పై కన్ను వేసిన అఖిల్..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన టాలెంట్ ఉన్న యువ దర్శకులలో ఒకరు అయినటు వంటి సుజిత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు రన్ రాజా రన్ మూవీ తో కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను ... సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన సాహో అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినప్పటికీ ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి మాత్రం సుజిత్ కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఇది ఇలా ఉంటే సాహో మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న సుజిత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా రూపొందుతున్న "ఓజి" అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ముంబై లో ప్రారంభం అయింది. ఇది ఇలా ఉంటే సుజిత్ ఈ మూవీ తర్వాత యంగ్ హీరో అఖిల్ తో మూవీ చేయబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే సుజిత్ ... అఖిల్ కు ఒక కథను వినిపించగా ... ఆ కథ బాగా నచ్చిన అఖిల్ ... సుజిత్ తో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అఖిల్ తాజాగా ఏజెంట్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ఈ రోజు థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: