మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'SSMB28' టైటిల్ అప్డేట్ వచ్చేసింది..!!

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న 'SSMB28' మూవీ అప్డేట్స్ కోసం ఫాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ కి సంబంధించి నిర్మాత నాగ వంశీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మహేష్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఉగాది కానుకగా విడుదల చేసిన మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

పోస్టర్ లో సిగరెట్ తాగడుతూ మహేష్ స్టైలిష్ వాక్ ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంది. ఇక ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు మేకింగ్ లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి సీన్ ని చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ను తాజాగా నిర్మాత నాగ వంశీ రివిల్ చేశాడు. ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తన సినిమా నుంచి అప్డేట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మే 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'SSMB 28' టైటిల్ను అనౌన్స్ చేయబోతున్నారట.

ఇక ఈ విషయాన్ని నాగ వంశీ స్వయంగా రివిల్ చేయడంతో మహేష్ ఫాన్స్ అయితే ఈ అప్డేట్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఈ సినిమాకి అర్జునుడు, ఆరంభం, అమరావతికి అటు ఇటు వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటికే కొన్ని వార్తలు వినిపించాయి. మరి వీటిలో ఏదో ఒక టైటిల్ ని మూవీ యూనిట్ ఫిక్స్ చేస్తారా? లేక మరో సరికొత్త టైటిల్ తో అనౌన్స్ చేస్తారా? అనేది మే 31న తేలనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: