మళ్ళీ మొదలకు వచ్చిన మహేష్ త్రివిక్రమ్ ల కథ ?

Seetha Sailaja

‘అల వైకుంఠపురములో’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో భారీ సినిమాను చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు అంటే ఎవరైనా నమ్మలేని విషయం. ఎన్టీఆర్ తో చేయవలసిన మూవీ క్యాన్సిల్ అయిన తరువాత మహేష్ తో సినిమా మొదలుపెట్టడానికి త్రివిక్రమ్ చాలకాలం వేచి చూడవలసిన పరిస్థితి వచ్చింది.

ఈమూవీకి సంబంధించిన కథ సెట్ అవ్వడానికి చాలసమయం పడితే ఆతరువాత కథ ఓకె అనుకున్న తరువాత మహేష్ తల్లి మరణంతో ఆతరువాత తండ్రి మరణంతో రకరకాల కారణాలతో ఈమూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈమూవీ మొదలుపెట్టాక ఈసినిమాలోని ఫైట్ సీన్స్ ను అద్భుతంగా తీయాలి అన్నఉద్దేశ్యంతో త్రివిక్రమ్ ‘కేజీ ఎఫ్’ ఫైట్ మాష్టర్లను తీసుకు వచ్చి యాక్షన్ సీన్స్ షూట్ చేసిన తరువాత ఆసీన్స్ మహేష్ కు నచ్చక పోవడంతో ఫైట్ మాష్టర్స్ ను మార్చవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటారు.

ఈమధ్య మహేష్ విదేశాలకు వెళ్ళకముందు హీరోయిన్ శ్రీలీల తో కలిపి ఒక ప్రముఖ మాల్ లో చిత్రీకరించిన సన్నివేశాలు దర్శకుడు త్రివిక్రమ్ కు నచ్చకపోవడంతో ఆసీన్స్ ను మళ్ళీ షూట్ చేద్దామని త్రివిక్రమ్ మహేష్ కు చెప్పిన సలహా అతడికి అసహనాన్ని కలిగించినట్లు గాసిప్పులు వస్తున్నాయి. మహేష్ ఈవిషయం పై కొంత అసంతృప్తికి లోనుకావడంతో త్రివిక్రమ్ తాను షూట్ చేసే సన్నివేశాల విషయంలో పూర్తి క్లారిటీ వచ్చిన తరువాత షూట్ పెట్టుకుందామని అప్పటికి ఎండలు కూడ బాగా తగ్గుతాయి కదా అంటూ త్రివిక్రమ్ కు తెలివిగా సలహాఇచ్చాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో మరొక గాసిప్ హడావిడి చేస్తోంది.

త్రివిక్రమ్ మహేష్ తో తీస్తున్న సినిమా పై పూర్తిగా దృష్టిపెట్టకుండా పవన్ కళ్యాణ్ తో సముద్రఖని తీస్తున్న ‘వినోదయ సితం’ స్క్రిప్ట్ వర్క్ పై తన పూర్తి దృష్టిపెట్టడం కూడ మహేష్ కు లోలోపల అసహనాన్ని కలిగించి ఉండవచ్చు అంటూ మరొక రూమర్ ప్రచారంలో ఉంది. మధ్యలో త్రివిక్రమ్ కొన్ని యాడ్స్ కూడ చేస్తున్నాడు. ఈవిషయాలు అన్నింటి పై మహేష్ కు కొంత అసంతృప్తి ఉందని అందువల్లనే మహేష్ త్రివిక్రమ్ ల మూవీ ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కు పడుతోంది అంటూ వాస్తున్న గాసిప్ లను ఈసినిమా నిర్మాతలు ఖండిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: