మరో క్రేజీ మల్టీస్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్..?

Anilkumar
ప్రస్తుతం మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. అప్పటి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి దిగ్గజనుటలు పలు మల్టీ స్టారర్స్ లో నటించారు. అయితే ఈ తరం హీరోల్లో చాలామంది మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా అగ్ర హీరోలు అయితే తమ స్టార్ డం ని క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ మల్టీ స్టారర్స్ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కొంతమంది అగ్ర హీరోలు మల్టీ స్టారర్ ట్రెండు కి అలవాటు పడుతున్నారు. అలాంటి హీరోల్లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. 

ఎన్టీఆర్ తనకు కథ నచ్చితే ఏ హీరో తో మల్టీ స్టారర్ చేయడానికి అయినా ఆసక్తి చూపిస్తున్నాడు.ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ లో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అలాగే దాని అనంతరం కే జి ఎఫ్ డైరెక్టర్ తో మరో భారీ పాన్ ఇండియా సినిమాని ప్రకటించాడు. ఓవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు బడా మల్టీ స్టారర్స్ లోను భాగమవుతున్నాడు ఈ నందమూరి హీరో. ఇటీవల బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్పై యూనివర్స్ లో..

హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2'లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ స్పై యూనివర్స్ గా పేరుందిన ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్ భాగం అవ్వడం ఫాన్స్ లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ కి ఓకే చెప్పాడట ఎన్టీఆర్. సౌత్ తో పాటు నార్త్ ని కలుపుతూ తీయబోతున్న ఓ భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ కోసం ఎన్టీఆర్ కి ఆఫర్ వచ్చిందట. ఇక ఈ ప్రాజెక్టులో ఓ బాలీవుడ్ బడా స్టార్ హీరో తో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన టిసిరీస్ నిర్మించబోతుందట. ఇక ఈ మల్టీ స్టారర్ కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా తొందర్లోనే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: