'ఆదిపురుష్' నుండి మూడు నిమిషాల ట్రైలర్.. ఎప్పుడంటే..?

Anilkumar
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ ట్రైలర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం డార్లింగ్ ఫాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడిగా కనిపిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ అగ్ర నరుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించరున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ని ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. 

టి సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 16న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్ పై దృష్టి సారించారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఆదిపురుష్ ట్రైలర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అందుకున్న సమాచారం ప్రకారం ఆదిపురుష్ ట్రైలర్ కట్ ని సుమారు మూడు నిమిషాల 22 సెకండ్లు ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లెవెల్ లో విజువల్ వండర్ గా ఉండబోతుందట. ఇక ఈ ట్రైలర్ తోనే ఆది పురుష్ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపించనున్నారట మేకర్స్.

గతంలో టీజర్ విషయంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారట. అంతేకాదు ఈ ట్రైలర్ ని మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ట్రైలర్ ని కేవలం 2Dలోనే రిలీజ్ చేస్తారా? లేక థియేటర్స్ లో 3D వర్షన్ లో కూడా రిలీజ్ చేస్తారా? అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.ఆదిపురుష్ నుండి మూడు నిమిషాల 22 సెకండ్ల ట్రైలర్ రాబోతుందని తెలియడంతో ట్రైలర్ కోసం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పలు పోస్టర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకోగా.. త్వరలోనే విడుదల కాబోయే ట్రైలర్ ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్టుకే,  మారుతి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: