మరో టాటూను వేయించుకున్న శృతి హాసన్...!!

murali krishna
టాటూ వేయించుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తి చూపుతున్నారు.ఇలా ఎంతోమంది వారి పేర్లను లేదా ప్రత్యేకమైన తేదీలను టాటూలుగా అయితే వేయించుకుంటూ ఉన్నారు.
ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే సెలబ్రిటీలు ఇలా టాటూలను వేయించుకోవడానికి చాలా ఆసక్తి అయితే చూపుతుంటారు. ఈ క్రమంలోనే నటి శృతిహాసన్ కూడా ఇదివరకే ఎన్నో టాటూలను వేయించుకున్న విషయం తెలిసిందే.ఈమె చేతి మణికట్టుపై గులాబీ టాటూ ఉండగా చెవి దగ్గర కూడా సంగీతానికి సంబంధించిన సింబల్ ను టాటూగా వేయించుకున్నారు. అయితే తాజాగా ఈమె మరొక టాటూ వేయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా అయితే తెలియజేశారు.
మరి ఈసారి శృతిహాసన్ ఎవరి పేరును టాటూగా వేయించుకున్నారు ఆ టాటూ ప్రత్యేకత ఏంటి అనే విషయానికి కనుక వస్తే ఈసారి ఈమె తన పేరును తమిళంలో టాటుగా వేయించుకోవడమే కాకుండా తనకు ఎంతో ఇష్ట దైవమైన మురుగన్ ఆయుధంలో తన పేరు ఉండేలాగా టాటూ వేయించుకున్నారట.. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ... నేనెప్పుడూ ఆధ్యాత్మికతను నమ్ముతాను.నా హృదయంలో మురుగన్ కు ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. ఈ పచ్చబొట్టుతో నాలోని భక్తిని ప్రదర్శించాలనుకుంటున్నాను అంటూ ఈమె ఈ టాటూ కు సంబంధించిన ఫోటోని షేర్ చేసింది.. ఇలా శృతిహాసన్ షేర్ చేసినటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది వీర సింహారెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య వంటి రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతిహాసన్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఈమె ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సలార్ సినిమాలో కూడా ఆమె నటించారు. ఈ సినిమాలో ఈమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు.మొదటిసారి ప్రభాస్ సరసన శృతిహాసన్ నటించడమే కాకుండా ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మెప్పించబోతుంది శృతి హాసన్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: