ఆర్జీవీ యూట్యూబ్ ఛానల్ పై మండిపడుతున్న నెటిజన్స్..!!

murali krishna
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ..తాజాగా నిజం పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబోతున్నారనీ సమాచారం.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనకున్న నిజా నిజాలను తవ్వి తీయడమే తన 'నిజం' ఛానెల్ ముఖ్య ఉద్దేశం అని వర్మ ప్రకటించడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది..
నిజం' ఛానెల్‌లో మొదటి ఎపిసోడ్‌గా 'వివేకా హత్య వెనక నిజంలో అబద్ధముందా?' అనే అంశం ప్రసారమవుతుందని రామ్ గోపాల్ వర్మ ప్రకటించినట్లు సమాచారం.. 'వివేకా మర్డర్ వెనక నిజంలోని అబద్ధాలు, ఆ అబద్ధాలు చెప్పే వాళ్ల వెనక ఉన్న మరికొన్ని నిజాలు, ఆ నిజాల వెనక వేరే వాళ్లు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ల పై వాళ్లు బలవంతంగా అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజంగా జరిగిన అబద్ధాలు, వాటన్నింటి వెనుక అసలు నిజాలన్నింటినీ కూడా తవ్వి తీయడమే 'నిజం' ఛానెల్ ముఖ్య ఉద్దేశం' అని వర్మ స్పష్టం చేసినట్లు సమాచారం.. 'వివేకా హత్య వెనక అస్సలు నిజంలో అబద్ధముందా?' అనే ఎపిసోడ్ ఈనెల 25న సాయంత్రం 4 గంటలకు ప్రసారమవుతుందని ఆయన తెలిపినట్లు సమాచారం.
వర్మ ప్రకటనపై నెటిజన్ లు భిన్నంగా స్పందిస్తున్నారు. వర్మ సినిమా మాదిరిగానే 'నిజం' యూట్యూబ్ ఛానెల్ అట్టర్ ఫ్లాప్ అవుతుందని , 'నువ్వు చెప్పింది కరెక్టే.. తిన్న బిస్కెట్లకు నువ్వెంత మొరిగినా జనాలకు నిజమేంటో తెలుసు.. సిబిఐకి కూడా తెలుసు' అని కామెంట్స్ కూడా చేస్తున్నారనీ తెలుస్తుంది. ఆర్జివి ఎవరు ఎన్ని అనుకున్నా కానీ తాను చేయాల్సింది అయితే చేస్తాడు. ఈయన మొదటి నుంచి కూడా జగన్ ప్రభుత్వాన్ని వెనకేసుకుంటూ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గురించి భిన్నంగా స్పందిస్తాడు ఆర్జీవీ. జగన్ కు మద్దతుగా ప్రతిపక్షం పై విభిన్నంగా స్పందిస్తాడు ఆర్జీవీ. ఇది వరకు ఆర్జీవీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పై సినిమా కూడా చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: