దళపతి విజయ్ ... గోపీచంద్ మలినేని మూవీకి నిర్మాత ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న తలపతి విజయ్ ఈ మధ్య కాలంలో టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తలపతి విజయ్ కొంత కాలం క్రితమే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన వారిసు అనే తమిళ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా ... రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

శ్రీకాంత్ ఈ మూవీ లో విజయ్ కి సోదరుడి పాత్రలో నటించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ తెలుగు లో వారసుడు పేరుతో విడుదల అయింది. ఈ మూవీ అటు తమిళ్ ... ఇటు తెలుగు బాక్స్ ఆఫీస్ ల దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే విజయ్ మరో సారి మరో తెలుగు దర్శకుడు తో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో విజయ్ నటించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ ని ఆర్ బి చౌదరి నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలబడ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ "లియో" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: