విజయ్ ... సమంత "ఖుషి" మూవీ స్టోరీ ఇదే..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఆఖరుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందినటు వంటి లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది.

ఇది ఇలా ఉంటే లైగర్ లాంటి భారీ అపజయం తర్వాత విజయ్ ప్రస్తుతం ఖుషి అనే లవ్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సమంత హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి శివ నిర్వాణ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో విజయ్ ... సమంత ఇద్దరు ప్రేమించుకున్నప్పటికీ ఈగో కారణంగా ఆ ప్రేమను చెప్పుకోరు అని ... అలాగే వీరిద్దరూ పెళ్లి పీటల వరకు వెళ్లి కూడా ఈగో వల్లే వీరిద్దరి పెళ్లి కూడా ఆగిపోతుంది అని ... చివరకు ఆ ఈగో వల్లే వీరిద్దరూ ఎలా కలిశారు అనేది ఈ సినిమా కథ అంటూ ఒక కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: