వైరల్ అవుతున్న సాయి పల్లవి పోస్ట్...!!

murali krishna
ఫిదా  సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుని తెలుగు ప్రేక్షకులను బాగా ఫిదా చేసిన నటి సాయి పల్లవి గురించి ప్రత్యేక చెప్పాల్సిన పని లేదు.
ఎలాంటి గ్లామర్ షోలు లేకుండా,కథ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నటువంటి సాయి పల్లవి ఈమధ్య ఎలాంటి సినిమాలను అయితే ప్రకటించలేదు. ఇలా సినిమాలకు సాయి పల్లవి దూరం కావడంతో ఈమె గురించి ఎన్నో రకాల రూమర్స్ వినిపించాయి. సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందని అలాగే తన వైద్య వృత్తిలో స్థిరపడబోతోందని ఎన్నో రకాల వార్తలు అయితే వచ్చాయి.
ఇలా సాయి పల్లవి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చిన కూడా ఈమె వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు.ఇక సోషల్ మీడియాకు కూడా చాలా దూరంగా ఉండే సాయి పల్లవి కేవలం ముఖ్యమైన విషయాల గురించి మాత్రమే స్పందిస్తూ ఉంటారనీ తెలుస్తుంది.. ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా సాయి పల్లవి తన చెల్లెలు పూజా కన్నన్ తో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేశారు. ఇక తన చెల్లెలు పూజ పుట్టినరోజు కావడంతో ఈమె తన చెల్లెలకు పుట్టినరోజుశుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన చెల్లెలు గురించి సుదీర్ఘమైన పోస్ట్ ను షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై మంకీ.. మంచి సోదరి కావాలనే తపనతో, నువ్వు నన్ను ఒక మనిషిగా అయితే మార్చావు.. నాకు ఎన్నో విషయాలను నువ్వు నేర్పించావు థాంక్యూ చెల్లె.. నువ్వే నా వెలుగు, నా ప్రేమ, నా సంతోషానివి.. ఐ లవ్యూ.. అని సాయి పల్లవి తన విషెస్ ను తెలియజేశారు. ఇలా సాయి పల్లవి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన ఈ పోస్టుపై సాయి పల్లవి సోదరి పూజ స్పందిస్తూ రిప్లై కూడా ఇచ్చారు. ఓ మై గాడ్.. ఐ లవ్యూ సో మచ్.. ఐ మిస్ యూ అంటూ ఎమోషనల్ అయిందనీ తెలుస్తుంది..ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలను ఒక వీడియో రూపంలో చిత్రీకరించి సాయి పల్లవి పోస్ట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: