భరత్ అనే నేను సినిమా.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..?

Divya
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ బ్రహ్మోత్సవం వంటి ఘోరమైన డిజాస్టర్ సినిమాల తరువాత నటించిన సినిమా భరత్ అనే నేను.. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.. హీరోయిన్గా కియారా అద్వానీ నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు ఈ సినిమా 2018 ఏప్రిల్ 20వ తేదీన విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబు నటన పరంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు అలాగే డైరెక్టర్ కొరటాల శివ టేకింగ్ కూడా మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రంతో మహేష్ బాబు మరొక కొత్త కోణాన్ని కూడా చూపించారు ఈ సినిమా విడుదల ఇప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్లు రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం.
1). నైజాం-21.32 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-10.45 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-9.33 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-4.50 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-7.28 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-8.31 కోట్ల రూపాయలు
7). కృష్ణ-5.68 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-2.70 కోట్ల రూపాయలు
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.69.75 కోట్ల రూపాయలు రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-1.55 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-17.50 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ. 99.35  కోట్ల రూపాయలు రాబట్టింది.

భరత్ అనే నేను సినిమా దాదాపుగా రూ.98.5 కోట్ల రూపాయల థియెట్రికల్ బిజినెస్ జరగక ఈ సినిమా సక్సెస్ సాధించాలి అంటే  రూ.99 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉన్నది.. అయితే ఈ సినిమా ఫుల్ రన్ టైమ్ లో ఈ చిత్రం రూ.99.35 కోట్ల రూపాయలను రాబట్టింది దీంతో  రూ.100 కోట్ల మార్క్ ను మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమాకి ఎన్నో సినిమాలు పోటీగా విడుదల ఇవ్వడమే కాకుండా ఐపీఎల్ సీజన్ కూడా కావడంతో ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అంటే అది మామూలు విషయం కాదు కేవలం ఈ సినిమా  రూ.35 లక్షల ప్రాపర్టీతో హీట్  గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: