భారీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న "ఆది పురుష్" మూవీ..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ చాలా రోజుల క్రితమే ఆది పురుష్ అనే మూవీ కి సంబంధించిన తన భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్నప్పటికీ ఈ మూవీ కి అత్యంత భారీ "వి ఎఫ్ ఎక్స్" పనులు ఉండడంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఈ చిత్ర బృందం చాలా రోజులను కేటాయించింది  ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి అనేక పోస్టర్ లను మరియు ఒక టీజర్ ను విడుదల చేసింది.

ఇందులో కొంత కాలం క్రితం ఈ సినిమా బృందం విడుదల చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుండి కాస్త నెగటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ బృందం ఈ సినిమా అవుట్ ఫుట్ ను మరింత అద్భుతంగా రావడం కోసం కొంత సమయాన్ని తీసుకొని ఈ సినిమా అవుట్ పుట్ ను మరింత మెరుగ్గా చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం జూన్ 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా 174 నిమిషాల భారీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. టీ సిరీస్ మరియు రెట్రో ఫైల్స్ నిర్మించిన ఆది పురుష్ మూవీ IMAX మరియు 3D ఫార్మాట్ లలో విడుదల కానుంది. ఈ మూవీ లో ప్రభాస్ కు జోడిగా కృతి సనన్ నటించింది. అజయ్ – అతుల్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.  సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: