విరూపాక్ష సినిమాకి పాజిటివ్ టాక్..!!

Divya
ఈనెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల కాబోతున్న చిత్రాలలో విరూపాక్ష సినిమా కూడా ఒకటి.. ఇందులో సాయి ధరంతేజ్ హీరోగా నటించగా.. హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లేవల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ చిత్ర బృందంతో సహా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొంటూ ఉన్నారు. తాజాగా రైలు ప్రయాణంలో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా ఇలాంటి హర్రర్ థ్రిల్లర్ కామెడీ సినిమాలను యంగ్ హీరోలు టచ్ చేయాలంటే కాస్త ఆలోచిస్తూ ఉంటారు.. కానీ సాయి ధరంతేజ్ మాత్రం ఏమీ ఆలోచించకుండా సుకుమార్ గారు చెప్పారని ఈ సినిమాలో నటించారట. అయితే ముందుగా సుకుమార్ గారు కథ పంపిస్తే లవ్ స్టోరీ అనుకున్నారట కానీ హారర్ స్టోరీ పంపించడంతో కాల్ చేయడం జరిగిందట కానీ సుకుమార్ గారు..90 లో జరిగే కథ అంటే చాలా కొత్తగా ఉంటుంది విలేజ్ నేపథ్యంలో సరికొత్త గా చూపించబోతున్నాము కథ విన్నా తర్వాత ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదని చెప్పారట. ఈ విషయాన్ని తాజాగా ఇంటర్వ్యూ ట్రైన్ లో తెలియజేశారు సాయిధర తేజ్.

వినిపిస్తున్న బజ్ ప్రకారం హైదరాబాదులో నిన్న రోజున సాయంత్రం ప్రైవేటు స్క్రీనింగ్ చేయడంతో ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ వచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సాయి ధరంతేజ్ చిత్రపు బృందం చాలా ఆకర్షణీయమైన మిస్టారికల్ యాక్షన్ త్రిల్లర్ సినిమాని తెరకెక్కించారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి మంచి బస్సు ఏర్పాటుచింది ముఖ్యంగా ఇందులో అఘోరాల గుహలు మేకింగ్ కూడా విజువల్స్ వీడియోతో విరుపాక్ష మేకింగ్ అంటూ ఒక వీడియో నెట్టింట హైలెట్గా  మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: