సుకుమార్, మైత్రి నిర్మాతలపై ఐటి దాడులు?

Purushottham Vinay
 ఈ మధ్య కాలంలో ప్యాన్ ఇండియా సినిమాలని నిర్మిస్తూ , పెద్ద పెద్ద స్టార్లతో హిట్లు కొడుతుంది మైత్రీ మూవీస్‌. 2015 వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ శ్రీమంతుడు సినిమాతో మొదటి సినిమాని నిర్మించి ఆ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి భారీ లాభాలని సంపాదించుకుంది ఈ సంస్థ.చాలా తక్కువ టైంలోనే ఇప్పటివరకూ ఏకంగా 17 పెద్ద సినిమాలు తీసింది. అల్లు అర్జున్ పుష్ప-2, పవన్‌కల్యాణ్‌తో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, విజయ్‌ దేవరకొండతో ఖుషీ ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాలు ప్రొడక్షన్‌లో ఉన్నాయి. ఇక ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌తో ఒక మూవీ, బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌తో మరో మూవీ కూడా తీస్తోంది. ఇంత భారీగా ప్యాన్ ఇండియా సినిమాలని ప్లాన్ చేసిన మైత్రీ మూవీస్‌పై ఐటీ రెయిడ్స్ అనే న్యూస్ ఇప్పుడు పెద్ద సెన్సేషనల్‌ న్యూస్ గా మారింది. మైత్రి మూవీస్ సంస్థ ఆఫీస్ లో ఐటీ రెయిడ్స్‌ టాలీవుడ్‌లో పెద్ద సంచలనం రేపింది. సుమారు మూడున్నర గంటలుగా 2 ఐటీ టీమ్స్ చెకింగ్ లు నిర్వహిస్తున్నాయి. సంస్థ డైరెక్టర్లు నవీన్ ఎర్నేని ఇంకా యలమంచిలి రవిశంకర్ ఇళ్లలో కూడా ఈ ఐటి సోదాలు జరుగుతున్నాయి.


అలాగే ఏకకాలంలో డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాల కోసం ఎంటరయ్యారు ఐటీ అధికారులు. కాగా మైత్రి మూవీస్‌, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప దేశ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాన్‌ ఇండియా సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 ది రూల్‌ సినిమా కూడా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇంతలోనే ఇలా ఐటీ దాడులు జరగడం టాలీవుడ్ లో పెద్ద సంచలనం రేపుతోంది.అయితే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై దాడులు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. గత సంవత్సరం డిసెంబర్‌ నెలలో కూడా ఐటీ అధికారులు ఈ సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ సంస్థ నుంచి వీరసింహా రెడ్డి ఇంకా వాల్తేరు వీరయ్య లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ లు వచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యానర్‌ చేతిలో పవన్‌ కల్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్, ఎన్టీఆర్‌ 31 ఇంకా ఆర్ సీ 16 వంటి భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: