ఆ బ్యానర్లో చిరంజీవి నెక్స్ట్ మూవీ..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతోంది. ఈ మూవీ లో శ్రీ ముఖి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. చిరంజీవి ... శ్రీ ముఖి మధ్య ఈ సినిమాలో చాలా సన్నివేశాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ బాగానే పూర్తి చేసి ఈ సినిమా బృందం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ మూవీ చివరి దశకు చేరుకున్నప్పటికీ ఇంకా చిరంజీవి తన నెక్స్ట్ మూవీ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి తన తదుపరి మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ లో చేయడానికి డిసైడ్ అయినట్లు ... మరి కొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే చిరంజీవి తాజాగా వాల్టేరు వీరయ్య మూవీ తో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: