ఆదిపురుష్ ఓవర్సిస్ హక్కులు పొందిన ప్రముఖ సంస్థ..!!

murali krishna
ప్రభాస్ స్టార్ డమ్ గురించి అందరికి కూడా తెలిసిందే.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫాలోయింగ్ తెచ్చుకున్న మొదటి తెలుగు హీరో ప్రభాస్ కావడం గమనార్హం
ఇక ప్రజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'ఆదిపురుష్' కూడా ఒకటి.. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు.. ఈ సినిమా లో ప్రభాస్ రాముడి గా నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది.. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.. సన్నీ సింగ్ లక్షణుడి గా నటిస్తున్నాడనీ సమాచారం... ఈ సినిమా కోసం ప్రభాస్ ముందు నుండి ఎంతో కష్టపడ్డాడు.. రాముడి పాత్రలో 'వి' షేప్ లో కనిపించడం కోసం చాలా శ్రమించాడు అని టీమ్ కూడా చెబుతుంది.. ఇంకా విలు విద్య లో కూడా ఆయన శిక్షణ తీసుకున్నాడు.. రామాయణం తెరకెక్కించడం కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ సంస్థ దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు  తెలుస్తుంది.. ఇది లా ఉండగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్  వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఓవర్సీస్ డీల్ పూర్తి అయినట్టు కూడా సమాచారం.. గత కొన్నాళ్ల నుండి ఓవర్సీస్ మార్కెట్ లో ఈ డీల్ ఎవరు సొంతం చేసుకుంటారు అనే దానిపై చర్చ కూడా జరుగుతూనే ఉంది.. ఇక ఇప్పుడు ఫైనల్ గా క్లారిటీ అనేది వచ్చింది. ఈ సినిమాను ఓవర్సీస్  మార్కెట్ లో ప్రముఖ సంస్థ ఏఏ ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు  కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా vfx లోపం కారణం గా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేక పోవడం వల్ల ఈ సినిమా పై అంచనాలు తగ్గాయనీ తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: