సౌందర్య చనిపోతుందని.. ఆమె తండ్రికి ముందే తెలుసా?

praveen
దివంగత హీరోయిన్ సౌందర్య.. ఈమె పేరు తెలియని సినీ ప్రేక్షకులు లేరు అనడం లో అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు వచ్చి పోయారు. కానీ సౌందర్య మాత్రం తన అందం అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పాలి. ఎక్కడా గ్లామర్ పాత్రలు చేయకుండా.. చీర కట్టులో నిండైనా రూపం లో పదహారణాల  ఆడపడుచు లాగా సినిమాల్లో కనిపించే వారు సౌందర్య. ఇక ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి గ్లామర్ షో చేయకుండానే అగ్ర హీరోయిన్గా చక్రం తిప్పారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఒకప్పుడు మహానటి సావిత్రి తర్వాత ఇక తెలుగు ఇండస్ట్రీలో ఆ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్గా సౌందర్య నిలిచింది అని చెప్పాలి. ఇక ఆమె ఇండస్ట్రీకి దూరమై 19 ఏళ్లు కావస్తున్న ఇప్పటికీ ఆమె రూపం ప్రేక్షకుల మదిలో అలాగే ఉంది అని చెప్పాలి. అయితే విమాన ప్రమాదంలో సౌందర్య అకాల మరణం చెందారు అన్న విషయం తెలిసిందే. అయితే సౌందర్య 2004లో చనిపోతుంది అన్న విషయం ఆమె తండ్రికి ముందుగానే తెలుసట. సౌందర్య తండ్రి సత్యనారాయణకు అప్పట్లో జాతకాల పట్టింపు ఎక్కువగా ఉండేదట.

 ఈ క్రమంలోనే ఒక జ్యోతిష్యుడికి ఆమె జాతకం చూపిస్తే ఆమె ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పారట. ఇక అనుకున్నట్లుగానే ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో ఆమెకు ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడం.. ఆ తర్వాత తక్కువ సమయంలోనే అగ్ర హీరోయిన్గా ఎదగడం జరిగింది. అదే సమయంలో 2004లో సౌందర్య కెరియర్ ముగుస్తుందని జ్యోతిష్యుడు చెప్పాడట. ఆ మాటలు విని బహుశా పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమవుతుందేమో అనుకున్నాము.. కానీ ఇలా జీవితమే ముగుస్తుందని ఊహించలేదు అంటూ  నటుడు చిట్టిబాబు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: