ఆ క్రేజీ కాంబినేషన్ మూవీ స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టనుందా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి బాబీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఇప్పటికే అనేక మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

తాజాగా బాబి ... మెగాస్టార్ చిరంజీవి హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా మైత్రి మూవీ సంస్థ నిర్మించిన వాల్టేర్ వీరయ్య అనే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... క్యాతరిన్ ఈ మూవీ లో రవితేజ భార్య పాత్రలో నటించింది. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ విజయంతో బాబి క్రేజ్ అమాంతం పెరిగి పోయింది.

దానితో ఈ దర్శకుడికి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న మూవీ ఆఫర్ దక్కింది. సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా దిల్ రాజు నిర్మించబోయే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఈ దర్శకుడి కి లభించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ మూవీ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రజిని ప్రస్తుతం జైలర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత కమిట్ అయిన మరో రెండు ... మూడు మూవీ లను పూర్తి చేసిన తర్వాత రజనీ కాంత్ ... బాబి ... దిల్ రాజు కాంబినేషన్ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: