ఓవర్ కాన్ఫిడెంట్ వల్లే.. సమంతకు దెబ్బ పడుతోందా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత ఎప్పుడు కూడా విభిన్నమైన పాత్రలోనే నటిస్తూ ఉంటుంది. తాజాగా డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం శాకుంతలం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. కొన్ని కారణాల చేత ఈ సినిమా ఆలస్యమైనప్పటికీ నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
అభిజ్ఞాన శాకుంతలం అనే నవల నుంచి తీసుకొని ఈ సినిమాను కథను డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు.చారిత్రాత్మక నేపథ్యంలో కలిగిన కథ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడడానికి ఆత్రుత ఎదురు చూశారు. శాకుంతలం సినిమా లో ఒకటి కూడా అద్భుతమైన సన్నివేశాలు లేకపోవడంతో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయినట్లు తెలుస్తోంది. శాకుంతల పాత్రను ఊహించుకున్నప్పుడు కలిగే భావన సమంతా ను చూస్తున్నప్పుడు కలగలేదని పలువురు నెటిజన్లు సైతం తెలియజేస్తున్నారు. సమంత ఈ పాత్ర కోసం చాలా కష్టపడిన ఆ కష్టమంతా వృధా అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.
వీటికి తోడు దుష్యంత మహారాజు పాత్రకు పరిచయం లేని దేవ్ మోహను తీసుకోవడం ఒక మైనస్ గా మారింది. చిత్రంలో ఎమోషన్స్ సన్నివేశాలు చాలానే ఉన్న ప్రేక్షకులను మాత్రం కదిలించలేకపోయాయి. భారీతనం ఫీలయ్యేలా చేయాలని సెట్టింగ్స్ మీద గ్రాఫిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.యుద్ధ సన్నివేశాలు సైతం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.దీన్ని మించిన ఘట్టాన్ని బాహుబలి సహా పలు చిత్రాలను చూసినప్పటికీ ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.

శాకుంతలం సినిమా సమంత ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల ఫ్లాప్ అయ్యిందని పలువురు అభిమానులు తెలియజేస్తున్నారు. దిల్ రాజు జడ్జిమెంట్ ఈ సినిమాకు పెద్దగా వర్కౌట్ కాలేదని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని తెలియజేశారు కానీ ఏమాత్రం ఇప్పించలేక పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అల్లు అర్హ మాత్రమేనని వార్తలు వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: