'సలార్' అప్డేట్స్ రాకపోవడానికి కారణం అతనే..?

Anilkumar
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో ఆరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అందులో ఆదిపురుష్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సలార్, ప్రాజెక్టు k, స్పిరిట్, మారుతి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అయితే ఆది పురుష్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కానీ ఇప్పటివరకు ఈ మూవీ నుంచి ఒక్క అప్డేట్ ని కూడా విడుదల చేయలేదు మేకర్స్. అయితే సలార్ మూవీ టీం సినిమా నుంచి అప్డేట్స్ ఇవ్వకపోవడానికి కారణం ఆదిపురుష్ మూవీ అని తెలుస్తోంది.ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ వల్లే సలార్ నుండి అప్డేట్స్ రావడం లేదట. 

ఇదే విషయాన్ని ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఆది పురుష్ మూవీని టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి శ్రీరాముని పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఎన్నో విమర్శల పాలయింది. దీంతో ఫ్యాన్స్ అయితే ఈ సినిమాపై అంత ఆసక్తి చూపించడం లేదు. జూన్ 16న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోని ఆది పురుష్ రిలీజ్ కి ముందే ఇతర సినిమాల నుంచి అప్డేట్స్ వస్తే మరింత నష్టం కలుగుతుందని భావించిన మూవీ టీం..

ఆదిపురుష్ విడుదల అయ్యేంతవరకు ఇతర సినిమాల అప్డేట్స్ రాకుండా చూడాలని ప్రభాస్ ని స్వయంగా రిక్వెస్ట్ చేశారట. అలా చేస్తే అటు అభిమానులు ఇటు ప్రేక్షకుల దృష్టి ఆదిపురుష్ పైనే ఉంటుందని వారి భావన. అందుకే సలార్ టీజర్, ప్రాజెక్టుకే ఫస్ట్ లుక్, ప్రభాస్ మారుతి ఫిలిం అనౌన్స్మెంట్ వీటన్నిటిని హోల్డ్ లో పెట్టారు. ఆదిపురుష్ విడుదల అవ్వగానే ప్రభాస్ ఇతర సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆదిపురుషు విడుదల అంటే జూన్ 16 వరకు ఆగాలి. సో అప్పటివరకు ప్రభాస్ ఇతర సినిమాల నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చే అవకాశం లేదు. ఇక దీనివల్ల ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశ చెందుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: