"శాకుంతలం" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
ఇప్పటికే ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు గల దర్శకుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్న గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గుణశేఖర్ ఆఖరుగా అనుష్క ప్రధాన పాత్రల రూపొందిన రుద్రమదేవి అనే భారీ బడ్జెట్ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ లో రానా కీలకమైన పాత్రలో నటించగా ... అల్లు అర్జున్ ఈ మూవీ లో గెస్ట్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా గుణశేఖర్ కు మంచి ప్రశంసలు లభించాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు శాకుంతలం అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో దేవ్ మోహన్ హీరో గా నటించగా ... సమంత హీరోయిన్ గా నటించింది. మోహన్ బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు.

ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి అదిరిపోయే రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.  తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు సభ్యులు యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా ఈ మూవీ యూనిట్ లాక్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ ని 142 నిమిషాల (2 గంటల 22 నిమిషాల) నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: