మహేష్ ... పవన్ మూవీలతో 25 కోట్లు పోగొట్టుకున్నాను... దిల్ రాజు..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న డిస్ట్రి బ్యూటర్ మరియు నిర్మాత అయినటు వంటి దిల్ రాజు గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  . దిల్ రాజు తన కెరియర్ ను డిస్ట్రిబ్యూటర్ గా మొదలు పెట్టి ప్రస్తుతం సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తూ వస్తున్నాడు .

ది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న దిల్ రాజు తాను సూపర్ స్టార్ మహేష్ బాబు ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా భారీ నష్టాలను ఎదుర్కొన్నట్లు చెప్పుకోచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా రిస్క్ తో కూడుకొని ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ వల్ల ఎక్కువ శాతం భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా నేను కూడా భారీ నష్టాలను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన స్పైడర్ సినిమా మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన అజ్ఞాతవాసి సినిమాలను భారీ ధరకు కొన్ని డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఈ రెండు మూవీ ల ద్వారా దాదాపుగా 25 కోట్ల నష్టం వచ్చింది అని అందువల్ల డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా రిస్క్ తో కూడుకున్నది అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా దిల్ రాజు అనేక స్టార్ హీరోల సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు ... రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ మూవీ ని నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: